మన్యం టివి, అశ్వాపురం:జీవన్ ఆధార్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు సోమవారం నాడు అశ్వాపురం మండల కేంద్రంలో పంచాయితీ కార్యాలయం దగ్గర వేములపల్లి కోటయ్య ఇంటి దగ్గర స్టిచ్చింగ్-బ్యూటీషియన్ తరగతులను స్థానిక సీఐ సట్ల రాజు ప్రారంభించారు.తొలుత స్థానిక జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణా గోపిరెడ్డి ,ఎంపీపీ ముత్తినేని సుజాత ,మాజీ ఎంపీటీసీ కొర్లపాటి రమాదేవి ,జీవన్ ఆధార్ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహుకులు గోగినేని వాసంతి గార్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం నిర్వాహుకులు వాసంతి మాట్లాడుతూ ఈ స్టిచ్చింగ్-బ్యూటీషియన్ కోర్స్ 15 రోజుల వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుందని, ఆసక్తి కలిగిన మహిళలు ఎవరైనా శిక్షణ తీసుకోవచ్చు అని తెలిపారు.ఈ శిక్షణలో వివిధ రకాల మగ్గం చేతి పనులు, మహిళలకు బ్యూటీషియన్ కి సంబంధించిన శిక్షణ ఇవ్వబడుతుంది అని అన్నారు.ఈ శిక్షణ కేంద్రానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సీఐ రాజు మాట్లాడుతూ మండలంలో మహిళలకు ఇటువంటి మంచి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన అంశం అని నిర్వాహుకులు వాసంతి ని అభినందించారు.ఈ 15 రోజులు మహిళలు కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో అందరూ కూడా మాస్కులు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి రమేష్,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: