మన్యం టీవీ, అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కానుకగా ఇస్తునటువంటి కళ్యాణలక్ష్మి,షాదిముబారక్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్&పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం ఈరోజు
అశ్వాపురం మండలం పరిధిలోని గొల్లగూడెం,మొండికుంట మల్లెలమడుగు,రామచంద్రపురం,నెల్లిపాక గ్రామాల్లో కళ్యాణలక్ష్మి,షాదీముభారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన జెడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ రెడ్డి,ఎంపీపీ ముత్తినేని సుజాత, మండల అధ్యక్షులు కోడ్ అమరేందర్, సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్నా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు ఏవి ఆపకుండా ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సర్పంచులు తాటి సుజాత,మర్రి మల్లారెడ్డి,కోడి క్రిష్ణవేణి,కాకా అశోక్,వెంకటరమణ,మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె ఖదీర్,ఎంపీటీసీలు ఎనిక రవి,గాదె జయ,యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,వల్లపు క్రిష్ణ,మందా హుస్సేన్,ఇసంపల్లి ప్వున్నారావు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: