CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజనేతరుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: ఏ ఎస్ పి

Share it:

 


మన్యంటివి:నూగురు వెంకటాపురం 

ఈరోజు వెంకటాపురం విశ్రాంతి భవనంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి రేగ గణేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏ వి ఎస్ పి జిల్లా సభ్యులు బోదె బోయిన సురేష్ ఏ ఎస్ పి వాజేడు మండల అధ్యక్షులు టింగ బుచ్చయ్య హాజరైనారు వారు మాట్లాడుతూ ఏపీ  శిలాంగ్ యాక్ట్ 1973 చట్టప్రకారం ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలను ఖేతార్ చేస్తూ ఆదివాసులను బెదిరించి పట్టా భూమి లోని చెరువును సైతం మింగేశారని వారు ఆరోపించారు అట్టి చెరువులోని ప్రభుత్వం వారు వేసిన చేపల సంపదను తన సొంత లబ్ధి కోసం ఉపయోగించుకుంటు సొమ్మును మూట కట్టుకుంటున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆ చెరువులోని చేపలు తమ జీవన ఉపాధి కోసం ఉపయోగించుకుంటామని వెళ్లిన ఆదివాసులను బెదిరించి అక్రమంగా కేస్ పెట్టడమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చెరువు విషయం పై మండల పరిషత్ అధికారులు గాని,రెవిన్యూ అధికారులు గాని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు మాత్రం గిరిజనేతరునికి కొమ్ముకాస్తున్నారని వారు ఆరోపించారు.ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసి చట్టాలపై గాని వారి హక్కుల మీద గాని అవగాహన లేకుండా ఆదివాసుల పట్ల చులకన భావంతో కులం పేరుతో దూషిస్తూ అవమానాలకు గురి చేసిన గిరిజనేతరుని పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేస్ నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి జిల్లా నాయకులు పూనం చంటి ,వేణుగోపాల్ ఏ వి ఎస్ పి జిల్లా నాయకులు కణితి వెంకట కృష్ణ ,రమేష్ మండల నాయకులు పాయం కృష్ణ, ప్రతాప్ తదిదరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: