CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు లో ఘనంగా సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవం...

Share it:

 





మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి ఎదులాపురం గోపాల్ రావు మాట్లాడుతూ ..1969 సంవత్సరం ఏప్రిల్ 22న లెనిన్ జయంతి రోజున రివిజనిజాన్ని ఓడించి, సిపిఐ (ఎంఎల్) ఆవిర్భవించి నేటికి 52 ఏళ్ళు అవుతుందని,నేటికి వారు వేసిన బాటలు దేశానికి శిరోధార్యమని భవిష్యత్ ప్రజలది విప్లవం అనివార్యం అన్నారు.

పార్లమెంటు పంథా ద్వారా ప్రజలకు ఓరిగేదిలేదని అన్నారు. పీడిత ప్రజల విముక్తికి దీర్ఘకాలిక ప్రజాయుద్ద పంథా ప్రతిఘటన పోరాటమే సరైన మార్గం అన్నారు. భారత విప్లవోద్యమంలో ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు తమ ప్రాణాలను బలిదానం చేశారన్నారు. అమరవీరుల ఆశయ సాధనకై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉమర్,  పి వై ఎల్ జిల్లా నాయకులు రాయల సిద్దు , పి ఓ డబ్ల్యూ నాయకులు కె పద్మ , ఏ ఐ కెయమ్ యస్ నాయకులు వల్లోజి రమేష్ , గలిగ వెంకటేశ్వర్లు, జవ్వాది నర్శింహారావు , జాటోతు నర్శింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: