CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయండి........

Share it:

 



 జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్  నాసిరెడ్డి సాంబ శివ రెడ్డి...

మన్యం టీవీ మంగపేట.

మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు నిధులు కేటాయిస్తూ మరికొన్ని కొత్త పథకాలకు రూపకల్పన చేసే విధంగా కృషి చేయాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కన్వీనర్ ఇట్టా మోహన్ రావుని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి  కోరారు. గురువారం తెలంగాణ పర్యటనలో భాగంగా వరంగల్ కి వచ్చిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కన్వీనర్ మరియు ఆంధ్ర ప్రదేశ్ స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ మోహన్ రావుని సాంబశివరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మిర్చి రైతుల సమస్యలపై ప్రత్యేక భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ మిర్చి రైతుల కోసం ఐపీయం కిట్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఆర్ పి ఎల్ రైతు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రకృతి వైపరీత్యాలు నుండి మిర్చిని కాపాడుకునేందుకు రైతులకు రాయితీపై టార్పాలిన్, శిల్పాలిన్ పరదాలు తప్పనిసరిగా పంపిణీ చేయాలని కోరారు. అదేవిధంగా రైతు స్థాయిలో  సిసి ప్లాట్ఫామ్స్ మంజూరు చేయాలని, వెనుకబడిన ప్రాంతాల్లో శీతల గిడ్డంగుల నిర్మాణానికి  ప్రత్యేక రాయితీలు కల్పించి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. మిర్చి సాగు లో నాణ్యతా ప్రమాణాల పెంపుకు ఈ స్పైస్ బజార్ పథకాన్ని వీలైనంత త్వరగా మంజూరయ్యేలా చూడాలని కోరారు. గోదావరి పరివాహక ప్రాంతమైన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పండుతున్న మిర్చి వంగడాలు, నాణ్యత ప్రమాణాలపై కన్వీనర్ కు సాంబశివ రెడ్డి వివరించారు. అనంతరం తెలంగాణ మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరమైన పథకాలపై లేఖను సాంబశివ రెడ్డి కన్వీనర్ మోహన్ రావు కి అందజేశారు. మిర్చి టాస్క్ ఫోర్స్ కన్వీనర్ హోదాలో తొలిసారిగా వరంగల్ నగరానికి వచ్చిన మోహన్ రావుకి సాంబశివ రెడ్డి పూల బొకే, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వరంగల్  రీజనల్ స్పైసెస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గాధి. లింగప్ప సహాయ అధికారి శరణప్ప, గురు ప్రసాద్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: