భద్రాచలంలో శ్రీ రామనవమి వేడుకలు బుధవారం నిరాడంబరంగా జరిగాయి. కరోనా వైరస్ కారణంగా ఈ సారి కూడా భక్తజనం లేకుండానే సీతారామ కళ్యాణం, పట్టాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు శ్రీ సీతారాముల స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కళ్యాణం జరిగింది దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వేదపండితులు, అర్చకులు, ఆలయ, ఇతర శాఖల అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.
Navigation
Post A Comment: