మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నందు అశ్వాపురం మండలం హెవీ వాటర్ ప్లాంట్ కాలనీకి చెందిన గౌతమి స్పూర్తి ఫౌండేషన్ సహకారంతో అను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పాల్వంచ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారందరికీ ఉచిత వైద్యం నిర్వహించేలా డా వి.యన్ రెడ్డి ఎంబిబిఎస్, డాఎం.రాజు ఎంబిబిఎస్, డా కూరపాటి ప్రియాంక ఎంఎస్లతో నిర్వహాంచిన ఈ క్యాంప్ ను అశ్వాపురం మండలం ఎంపిపి ముత్తినేని సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పోడియం సుజాత,జెడ్పి కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,మాజీ సర్పంచ్ పోడియం అనిల్ కుమార్, ఉపసర్పంచ్ బొల్లినేని గణేష్, హెవీ వాటర్ ప్లాంట్ గుర్తింపు సంఘం నాయకులు పాడ్య కేశవరావు, కడారి గురవయ్య,మండల తెరాస నాయకులు బొబ్బాల నాగేశ్వరరావు,వలబోజు మురళీకృష్ణ,బండారు జనార్దన రావు,స్థానిక ఆశావర్కర్లు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదానంలో పాల్గొన్న యువకులను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అదేవిధంగా క్యాంపు నిర్వహనలో పాల్గొన్నా వైద్యులందరికి ఎంపిపి ముత్తినేని సుజాత,సర్పంచ్ పోడియం సుజాత శాలువాలతో సత్కరించి అభినందించడం జరిగింది.
Post A Comment: