మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో శనివారం నాడు అంబేద్కర్ యువజన సంఘం సీనియర్ జిల్లా నాయకులు మైప లాలయ్య అధ్యక్షతన అంబేద్కర్ సంఘం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మైప లాలయ్య మాట్లాడుతూ మంగపేట మండల అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీని తక్షణమే మార్చాలని నూతన కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల నాయకులు మోదుగు బాబు, దుర్గం నరసింహారావు,బోడ బొర్రయ్య,నాగేష్,పుల్లూరు తిరుపతి,బోడ జయరాజ్, మోదుగు శ్రీనివాస్,బోడ సురేష్,బోడ అచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: