మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, అణగారిన కులాల, అట్టడుగు వర్గాల, చైతన్యం కలిగించడం కోసం అనునిత్యం పరితపించిన మహాత్ముడు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి 194 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి రేవతి, వైస్ ఎంపీపీ మామిడిపల్లి రామారావు, ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: