మన్యం మనుగడ పినపాక:
టిఆర్ఎస్ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పుట్టినరోజు సందర్భంగా మన్యం మనుగడ ప్రత్యేక సంచికను ప్రచురించింది.ఈ సందర్భంగా పినపాక మండలం లోని టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖులు ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్ లో గల టిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో ప్రత్యేక సంచికను పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆవిష్కరించడం జరిగింది. రేగా కాంతారావు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సంచికను చాలా ఆసక్తిదాయకంగా మండల ప్రముఖులు చూడడం జరిగింది. వీరుకాక మండలంలో పలు ప్రదేశాలలో మన్నెంలో మొనగాడు ప్రత్యేక సంచికను ఆసక్తిదాయకంగా పాఠకులు చూస్తున్నారు
ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక మండల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపి, అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని అటువంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక సంచికను ప్రచురించడం ఆనందదాయకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి శేఖర్ వర్మ, ఆత్మ చైర్మన్ భద్రయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, పినపాక మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చింతపంటి సత్యం, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, బొలిశెట్టి నరసింహారావు, దాట్ల వాసు బాబు, వార నరసింహారావు, పినపాక మండల ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు తోలెం శ్రీను,టిఆర్ఎస్వి విభాగం అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: