మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం భద్రాచలం పరిధిలో గల డంపింగ్ యార్డ్ వద్ద మృతదేహం అనుమానాస్పదస్థితిలో లభ్యమైంది. దీనిని గమనించిన గ్రామపంచాయతీ కార్మికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అతని వద్ద ఉన్న ఆధార్ కార్డ్ సహాయంతో ఏపీ లోని విశాఖ కు చెందిన బర్ల శ్రీనివాసరావు గా గుర్తించారు. మృతుడు ఖాకీ చొక్కా వేసుకోవడంతో ఆటో డ్రైవర్ అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని ఇంటి వద్ద చెప్పకుండ వచ్చినట్లు వారు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయడానికి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: