CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితులతో గ్రామ సభ సమావేశం

Share it:

 


👉🏻(పిడి అవార్డు ఎంక్వైరీ కొరకు)


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, తొట్టిపంపు(అన్న దైవం) గ్రామంలో సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితులతో గ్రామ సభ సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు , స్థానిక తాహసిల్దార్ కె భద్రకాళీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రామ సభలో సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోతున్న 106 మంది రైతుల యెుక్క సుమారు ఎ" 148.23 కుం" భూముల వివరాలను, సంబంధిత అధికారులు చదివి వినిపించారు. జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతుల నుంచి ఏమైనా అభ్యంతరాలు గాని, విజ్ఞప్తులు గాని ఉన్నచో రాతపూర్వకంగా తెలియపరచాలని కోరారు. పూర్తి విచారణ అయిన తర్వాత నివేదిక తయారు చేసి , ప్రభుత్వం నుండి రైతులకు నష్ట పరిహారాన్ని అందజేస్తామని తెలియజేశారు. ఈ గ్రామ సభ అవార్డు కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ సునీత ఎలిజబెత్ , సీనియర్ అసిస్టెంట్స్  వర్సా లక్ష్మణ్ , మేకల లక్ష్మీనారాయణ , బోడ దేశ్పాండే , తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది , రైతులు  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: