చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
చండ్రుగొండ మండలం పరిధిలోని గానుగపాడు గ్రామంలో గ్రామ పంచాయితీ కార్యాలయానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని ప్లాట్లు గా ఏర్పాటు చేసి అమ్ముతున్నారని వెంటనే సర్వే చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని అట్టి వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం చండ్రుగొండ తహసిల్దార్ ఎం ఉష శారద కు గానుగుపాడు సర్పంచ్ వాసం లలిత శివజ్యోతి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన తహసీల్దార్ విచారణ చేపట్టి అది ప్రభుత్వ భూమిని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పీసా కమిటీ అధ్యక్షులు నునవత్ శంకర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని గతంలో డబల్ బెడ్ రూమ్ నిర్మాణాల కోసం ఆరోగ్య ఉప కేంద్రం కోసం ఆ స్థలాన్ని కేటాయించారని ఇప్పుడు దాంట్లో కొంత మంది ఆక్రమించుకొని వెంచర్లు ఏర్పాటు చేశారని వాటిని తీసివేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశాము. దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Post A Comment: