మన్యం టివి,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
దమ్మపేట మండలం లో ముష్టిబండ నుంచి వడ్లగూడెం గ్రామం వెళ్లే మార్గం లో గల మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం సమీపంలో శివ దత్త సాయి ఆశ్రమం అద్వర్యం లో వంద నుంచి 150 మంది పేదవారికి వృద్దులకు వికలాంగులకు అనాధలకు అన్నప్రసాదం ఇంటింటికి వెళ్లి ఇచ్చే కార్యక్రమం ఉగాది పర్వదిన సందర్బంగా మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజు గురువారం జరిగిన కార్యక్రమానికి దాత కొంపట్ల హరిప్రియ అమెరికా వాస్తవ్యులు. ఈ కార్యక్రమం ప్రతి గురువారం రోజున జరుగుతుంది. ఈ కార్యక్రమం మొదలు పెట్టిన మొదటి గురువారం విజయవంతమైందని శివ దత్త సాయి ఆశ్రమ కమిటీ వారు చెప్పారు.
Post A Comment: