మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అశ్వాపురం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్,
ఎంపీపీ ముత్తినేని సుజాత ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఆషామాషీ గా ఏర్పడిన పార్టీ కాదని తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ,ఆత్మ గౌరవం కోసం, అస్థిత్వం, అభివృద్ధికోసం, నీళ్ల కోసం ,నిధులకోసం, కొలువుల కోసం, ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో కెసిఆర్ నాయకత్వంలో జయశంకర్ రూపకల్పనలో 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన ఉద్యమ పార్టీ అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా కెసిఆర్ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు ఎన్నో త్యాగాలు చేస్తూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని నేటికీ ఈ పార్టీ 20 సంవత్సరాలు పూర్తిచేసుకుని 21వ సంవత్సరంలోకి ముందుకు వెళుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉద్యమ నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనాటి ఉద్యమకారుడు ఈనాటి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కెసిఆర్ నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ రంగాలలో ఎంతో అభివృద్ధి సాధిస్తుందని వారన్నారు.ఈ పతాకావిష్కరణ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, చింతిర్యాల సర్పంచ్ పాయం భద్రయ్య, ఉప సర్పంచ్ వెన్న అశోక్, టిఆర్ఎస్ నాయకులు సూదిరెడ్డి గోపిరెడ్డి, బాణోత్ సదర్ లాలు, చిలక వెంకట్రామయ్య, గంజిబాబు, టిఆర్ఎస్వి నాయకులు లంకెల రమేష్,, వల్లబోజు మురళి కృష్ణ మందా హుస్సేన్, మల్లెలమడుగు టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఈసంపల్లి పున్నారావు,వల్లపు కృష్ణ, మంగళగిరి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: