మన్యం టీవీ మంగపేట.
మంగ పేట మండలంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో మండలం ముఖ్య కార్య కర్తల సమావేశం పార్టీ సంస్థాగత నిర్మాణము కొరకు సమావేశం జరిగినది. ఈ సమావేశమునకు ముఖ్య అతిధిలు జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్, మండల ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డి ,ములుగు ఆత్మ చైర్మన్ బైకాని ఓదెలు,ఏటూరునాగారం పీఏసిఎస్ చైర్మన్ కునూరు అశోక్, హాజరై ఈ సమావేశంను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టి సంస్థాగత నిర్మాణం లో భాగంగా త్వరలో గ్రామ కమిటీలు వెయ్యడం జరుగుతుంది అనిపార్టీ పటిష్ఠతకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని అన్నారు. సమావేశం అనంతరం ఇటీవలే అనారోగ్యం గురైన తెరాస నాయకులు అన్వర్ ఇంటి వద్ద అతన్ని పరామర్శించారు.ఇట్టి కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ, ,మండల ప్రదానకార్యదర్శి గుండేటి రాజు యాదవ్, మండల రైతు బంధు అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి,,పీ ఏ సి ఎస్ డైరెక్టర్లు సిద్ధం శెట్టి లక్ష్మణ్ రావు,అచ్చ సత్యనారాయణ నర్రా శ్రీధర్, అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ,చిలకమర్రి రాజేందర్,కుంట ఏడుకొండలు,ఆయూబ్ ఖాన్,మండల అధ్యక్షురాలు కాటూరి సుగుణ, కొడెం సత్యనారాయణ, నూనె లింగయ్య మండల మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీ హరి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: