మన్యం టీవీ మణుగూరు:
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి, పిఆర్సి మరియు 30% ఫిట్మెంట్ వెంటనే అమలు చేయాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం స్థానిక తహసీల్దార్ చంద్ర శేఖర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ సింగరేణి లో కాంట్రాక్టు వ్యవస్థ అంటేనే బానిస వ్యవస్థ అని,మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఊసే మరిచారు అని విమర్శించారు.అన్ని విభాగాల కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ కార్మికులకు పిఆర్సి మరియు 30% ఫిట్మెంట్ అమలు చేస్తామని ప్రకటించి,సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాట్లాడకపోవడం దారుణమన్నారు.ఇది సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.ఇప్పటికైనా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి,పిఆర్సి మరియు మరియు 30% ఫిట్మెంట్ ను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎం. రామయ్య,నాగరాజు, చారి,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: