టాలీవుడ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సామాన్యులతోపాటు రాజకీయ ప్రముఖులను కూడా ఈ వైరస్ వదలడం లేదు. ఇప్పటికే చాలా మంది తారలు కరోనా బారిన పడగా, తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కరోనా నిబంధనల ప్రకారం ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నానని తెలిపింది. అంతేగాకుండా… గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అభిమానులు చూపిస్తున్న ప్రేమకు, ఆప్యాయతకు ధన్యవాదాలు. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి అంటూ పూజా పోస్ట్లో పేర్కొంది.
Post A Comment: