మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం గ్రామ రెవిన్యూ అధికారి పల్లె వెంకన్న (54) అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ హాస్పటల్ నందు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మృదుస్వభావి, స్నేహశీలి, పడమట నర్సాపురం రెవెన్యూ గ్రామ పంచాయతీకి రెవెన్యూ అధికారి గా వచ్చిన అనతికాలంలోనే అందరితో కలివిడిగా ఉంటూ.. మంచి పేరును సంపాదించుకున్నారు. విఆర్వో వెంకన్న మరణ వార్త తెలుసుకొన్న స్థానిక ప్రజా ప్రతినిధులు సర్పంచ్ కట్రం మోహన్ రావు, ఎంపీటీసీ కాజా విజయ రాణి, ఉప సర్పంచ్ భూక్య రవి, విచారం వ్యక్తం చేస్తూ... వెంకన్న గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Post A Comment: