CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాజాపురం గ్రామంలో విలేజ్ లెర్నింగ్ సెంటర్ ప్రారంభం

Share it:

 



మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, రాజపురం గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో, గ్రామ పెద్దలు కాళ్ళూరి రాజేశ్వరరావు స్వగృహం (దివానం) నందు, అంబేద్కర్ 130 వ జయంతి సందర్భంగా విలేజ్ లెర్నింగ్ సెంటర్ (విఎల్సి) ను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురుకుల పాఠశాల/కళాశాలలా జిల్లా సమన్వయ అధికారి (డిసిఓ) శ్రీ డాక్టర్ కన్నెగంటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. వారు విఎల్సి సెంటర్ను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా వలన చదువుకు దూరమైన విద్యార్థినీ,విద్యార్థులకు వారి గ్రామంలో విఎల్సి సెంటర్ ద్వారా విద్యను అందించడం హర్షించదగిన పరిణామమని వ్యాఖ్యానించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపిపి సున్నం లలిత మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు విలేజ్ లెర్నింగ్ సెంటర్ను  సద్వినియోగం చేసుకోవాలని, అన్నపురెడ్డిపల్లి గురుకుల పాఠశాలను, సైనిక్ స్కూల్ గా మార్చడానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మరియు ప్రభుత్వం అధికారులతో మాట్లాడతాం అని అన్నారు. ఈ విలేజ్ లెర్నింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖులు టిజిపిఎ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు జున్ను సత్యనారాయణ, స్వేరోస్ జిల్లా అధ్యక్షులు చిలకబత్తిని వీరయ్య, వైస్ ప్రిన్సిపల్ సందీప్ కుమార్, ఎస్ జె పి రాష్ట్ర అధ్యక్షులు పెంబుల లక్ష్మయ్య, టిజిపిఎ నాయకులు పురుషోత్తం, సర్పంచ్ ఎన్ రాములు, వి ఎల్ సి ఇంచార్జి పి నాగేశ్వరరావు, మమత (కమాండర్) స్వేరోస్ ,బాల ప్రసాద్,  కొత్తపల్లి శ్రీను, జున్ను రవి,శేషు, నాగమణి, రవీందర్, జంపన్న, విద్యార్థిని,విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: