లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడాకారులకు స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ:ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం టీవీ మణుగూరు:
యువత సమాజంలో కీలక పాత్ర వహించి,అన్ని రంగాలలో రాణించాలని ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.మణుగూరు కో ఎడ్యుకేషన్ పాఠశాల నందు జనవరి నెలలో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన క్రీడా పోటీలలో పినపాక నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో మెదటి బహుమతి కరకగూడెం జట్టు,రెండవ బహుమతి పినపాక జట్టు విజేతలకు మణుగూరు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ దుస్తులును ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ముత్యాల రావు,చంద్ర మోహన్,బొగ వెంకటేశ్వర్లు, గాజుల రమేష్,ఆదివాసీ ఉద్యోగ,సాంస్కృతిక సంఘాల అధ్యక్షులు పోలెబోయన అనిల్ కుమార్,వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొమరం.వెంకటనారాయణరావు,అంజయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని. బాబురావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, టిఆర్ఎస్ నాయకులు ముద్దంగుల.కృష్ణ,టిఆర్ఎస్ యువజన నాయకులు మారోజు.రమేష్,జక్కం.రంజిత్,గుర్రం.సృజన్,తాళ్లపల్లి. రాహుల్,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: