పర్యటనలో పోంగులేటి వెంట మెచ్చా
మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, రాజాపురం గ్రామంలో ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యులు పోంగులేటి శ్రీను పర్యటించారు.గులాబీ దళంలో చేరిన అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, వారి వెంట పర్యటనలో పాల్గొన్నారు.అదివాసి నాయకపోడు ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి కొలుపు కార్యక్రమంలో పాల్గొని, పూజాకార్యక్రమాలు నిర్వహించారు. కోద్ది రోజులు క్రితం మరణించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బోమ్మకంటి వీరభద్రం కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు.అనంతరం పొతిని రమణ మనవరాలు అన్నప్రాసన కార్యక్రమానికి హాజరై చిన్నారిని దీవించారు.ఈ పర్యటనలో వారి వెంట ఎంపిపి సున్నం లలిత, నాయకులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, బత్తుల అంజి, పర్సా వెంకట్, దుబ్బాకుల రాము, శ్రీనివాస్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Post A Comment: