పినపాక మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి
మన్యం మనుగడ పినపాక:
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.కరోనాను నియంత్రించేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. ఏప్రిల్ 20 నుండి మే1వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. కావున పినపాక మండల పరిధిలోని ప్రజలు,వ్యాపారస్తులు సహకరించాలని ఏడూళ్ల బయ్యారం పోలీస్ శాఖ వారు కోరారు.
నిబంధనలు ఉల్లగించిన వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
1.రాత్రి 8 గంటలల్లోపు వ్యాపార సముదాయాలను మూసి వేయాలని తెలిపారు.
2.అత్యవసర సేవలు మరియు నిత్యావసర సరుకుల రవాణా,మెడిసిన్, రవాణా,నీటి సరఫరా సంబందించిన పనులు మినహాయింపు కలిగించారు.కావున ప్రజలు కర్ఫ్యూ కి సహకరించి కరోన వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలరని పోలీసులు విజ్ఞప్తి చేశారు.శ్రేయ నియంత్రణ పాటించి కరోనా బారిన పడకుండా ఉందాం అని ఏడూళ్ల బయ్యారం ఎస్ ఐ టీ వీ ఆర్ సూరి అన్నారు
Post A Comment: