CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాస్కు లేకుంటే సామాజిక దూరం పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం..

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.


మహమ్మారి కరోనా వైరస్ మండలంలో విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉన్న అన్ని షాపుల వద్దకు అధికారులు స్వయంగా వెళ్ళి యజమానులకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరు మాస్కు తప్పని సరిగా ధరించాలని  షాపుల వద్ద మనిషికి మనిషికి కనీసం రెండు మీటర్లు సామాజిక దూరం పాటించాలని ప్రతి షాప్ ఎదురుగా శానిటైజర్ సబ్బు నీళ్ళు ఉంచాలని  మీ షాపులకు వచ్చే వినియోగదారులకు మాస్కు ఉంటేనే తమ వస్తువులను విక్రయించాలని సూచించారు.  లేనిపక్షంలో ఇరువురు పై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా షాపుల యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ సతీష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి కే ఉపేందర్, పంచాయతీ గుమాస్తా సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: