మన్యం టీవీ,అశ్వారావుపేట:
మండలంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గురువారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొత్తం 281 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని వైద్యాధికారులు పేర్కొన్నారు.
Post A Comment: