మన్యం టివీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్నారంలో అక్కిన.శేషగిరిరావు కు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వచ్చిన రూ.4 లక్షల రూపాయల చెక్కును ఆదివారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సబ్యులకు అందజేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.అనంతరం బాధితులు మాట్లాడుతూ సామాన్య పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా సహాయం చేయడం చాలా గొప్ప విషయం అని,ఈ సహాయం పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది అని,సహాయం అందించిన సీఎం కేసీఆర్ కు,విప్ రేగా కాంతారావు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో జెడ్పిటిసి పోశం.నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరావు, కో-ఆప్షన్ జావిద్ పాషా, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బోలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,పట్టణ యువజన నాయకులు రుద్ర వెంకట్, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: