CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విజృంభిస్తున్న కరోనా ఒకే కుటుంబంలో ఐదుగురికి మొత్తం 33 మందికి పాజిటివ్ లు

Share it:

 



మన్యం టీవీ: ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పట్టణంలో కరోనా ఉదృతి క్రమక్రమంగా పెరుగుతోంది ప్రభుత్వ ప్రధాన వైద్యశాల కొమరారం, రొంపేడు పీహెచ్సీలో రాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజే 33 మంది కి కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యులు తెలిపారు. పట్టణంలోని 24 ఏరియాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ఇందిరా నగర్ 9 సుభాష్ నగర్, వెంగల్ రావు కాలనీ, జీకే ఓ సి ఏరియాలో ఒక్కొక్కటి చొప్పున, 14 నెంబర్ బస్తి, సంజయ్ నగర్, కొత్త కాలనీ, మర్రిగూడెం, పంచాయతీలో ని  రామకృష్ణాపురం లలో 2 చొప్పున  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల ఇన్ చార్జ్ డాక్టర్ వరుణ్ కుమార్, ఇల్లందు మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్కులు కచ్చితంగా ధరించి శానిటైజర్ వాడాలని ఆయన కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: