మన్యం టీవీ, అశ్వరావుపేట:
కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల్లో అశ్వారావుపేట మండలంలో బుధవారం మరో 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మూడు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల పరిధిలో 131 మందికి పరీక్షలు నిర్వహించగా 32 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అశ్వారావుపేట పీహెచ్ సీలో 47 మందికి గాను 16, వినాయకపురం పీహెచ్ సీలో 46 మందికి గాను 12, గుమ్మడవల్లి పీహెచ్ సీలో 38 మందికి గాను 4 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు.
Post A Comment: