మన్యంటీవీ,అశ్వారావుపేట:
అశ్వారావుపేట పట్టణంలో కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పట్టణంలోని అన్ని రకాల వ్యాపారస్తులతో అశ్వారావుపేట సర్పంచ్ అట్టాం రమ్య మరియు పెరయిగూడెం సర్పంచ్ నార్లపాటి సుమతిలతో కలిసి ఎంపిపి జల్లిపల్లి శ్రీరామమూర్తి అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపిపి మాట్లాడుతూ కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్క వ్యాపార సముదాయాలు 26 వ తేదీ సోమవారం నుండి మే 2 ఆదివారం వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే షాపులు తెరచి ఉండాలని ఆయన తెలిపారు. 2 గంటల తర్వాత షాపులు తెరిచి ఉంచి నిబంధనలను అతిక్రమిస్తే రూ. 5 వేల రూపాయలు ఫైన్ వేస్తారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలకు కట్టుబడి సహకరించాలని కోరుతున్నారు. ఈ బంద్ కి ప్రజా ప్రతినిధులతో కలిసి అన్ని రకాల వ్యాపార యూనియన్లు ఏకగ్రీవంగా తీర్మానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, యూనియన్ బాధ్యులు పాల్గొన్నారు.
Post A Comment: