అధికారులు,ప్రజా ప్రతినిధుల తో కలిసి స్థలాన్ని పరిశీలించిన విప్ రేగా కాంతారావు
మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం,గుట్ట మల్లారం పంచాయతీ పరిధిలో రూ.2 కోట్ల రూపాయలతో అధునాతన సదుపాయాలతో నూతన ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నారు. ఇందుకు కావలసిన స్థలాన్ని మంగళవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులు,ప్రజా ప్రతినిధుల తో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పొశం.నరసింహారావు,ఎంపీపీ కారం.విజయ కుమారి, తహశీల్దార్ చంద్ర శేఖర్, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,ఎంపీడీఓ పి.వెంకటేశ్వర్లు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,ఎంపీటీసీ కణితి బాబురావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ లు బచ్చల భారతి,కారం.ముత్తయ్య టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి. నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: