మన్యం టీవీ, అశ్వరావుపేట:
అశ్వారావుపేట మండలం లో ఆదివారం 18 మందికి కోవిడ్ సోకింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంల పరిధిలో మొత్తం 225 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 18 మంది కరోనా బాధితులు గా తేలారు. అశ్వరావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో 23 మందికి 8 మంది, వినాయకపురం ఆరోగ్య కేంద్రంలో 104 మందికి ఎనిమిది మంది, గుమ్మడవెల్లి ఆరోగ్య కేంద్రంలో 98 మందికి ఇద్దరు కోవిడ్ తో బాధపడుతున్నట్లుగా ఆయా ఆసుపత్రుల వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాంబాబు, డాక్టర్ హరీష్ లు తెలిపారు.
Post A Comment: