CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మండల వ్యాప్తంగా ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 130 వ జయంతి వేడుకలు: జడ్పీటీసీ పొశం. నర్సింహారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో బుధవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 130 వ జయంతి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ భవన్ మరియు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం అంబేద్కర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా జడ్పిటిసి పొశం.నరసింహారావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల మతాలు,కులాలు అన్ని ఐక్యంగా ఉండాలని, భారతదేశ పౌరులు స్వేచ్ఛ, స్వతంత్రంగా జీవించాలని, అనేక దేశాలలో ఉన్న రాజ్యాంగాన్ని మిళితం చేసి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని నిర్మించిన అటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ని ఘనంగా స్మరించుకోవాలి అని,బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు కొనసాగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడప. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, రామనుజవారం ఉప సర్పంచ్ ప్రభుదాస్, యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,టిఆర్ఎస్ నాయకులు ఎడ్ల.శ్రీను, ముద్దంగుల కృష్ణ,తంత్రపల్లి కృష్ణ,ఉప్పుతల.రామారావు, వేముల లక్ష్మయ్య,వెంకట్ రెడ్డి,తాత రమణ,తూపూడి శీను,ఆవుల.నరసింహారావు,మేకల రవి,వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: