మన ఏంటి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
దమ్మపేటలో 14/4/2021
భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా దమ్మపేట మండలం మందల పల్లిలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తూ ఏ ఐ కె ఎస్ సి సి రైతు సంఘం నాయకులు ప్రజా సంఘ నాయకులు ప్రజలు,దళితులు, గిరిజనులు పాల్గొన్నరు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సిపిఐ జిల్లా నాయకుడు యార్లగడ్డ భాస్కర్ రావు,సిపిఎం నాయకులు మొరంపూడి శ్రీనివాసరావు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు అమర్లపూడి రాము మాట్లాడుతూ డాక్టర్అంబేద్కర్ ఆశయాలను సాధించాలని రాజ్యాంగాన్ని కాపాడాలని ఈ అనగారిన వర్గాల కోసం ఎంతో త్యాగం చేసిన అణగారిన వర్గాల కోసం ఎన్నో చట్టాలు రూపొందించినా అంబేద్కర్ ని వారి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని ఆయన ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలి,కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అన్ని ప్రైవేటు పరం ఈ రోజున దళితులకు గిరిజనులకు బీసీలకు రిజర్వేషన్లను తొలగించే ప్రక్రియ లో కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని అడ్డుకట్ట వేయకపోతే రేపు అనగారిన వర్గాల కు అన్యాయం జరుగుతుందని దినికి ప్రజలు అనగారిన వర్గాలు ఎత్తున ఉద్యమాలు చేయాలని ప్రభుత్వ చర్యలను ఎండగట్టాలని రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి పండూరి వీరబాబు,సిపిఐ మండల కార్యదర్శి తంగెళ్ళమూడి,శివకృష్ణ ఈశ్వరి సుంకు పాక,ధర్మ చందన సిపిఎం నాయకులుదొడ్డ లక్ష్మీనారాయణ,కొప్పుల శ్రీను, కురసం ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: