మన్యంటీవీ,అశ్వారావుపేట: మండలంలోని కరోన సెకండ్ వ్యేవ్ తీవ్రత పెరుగుతుండడంతో అశ్వారావుపేట లోని ఖమ్మం రోడ్ లో గల స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రక్కన గలా గిరిజన బాలికల వసతి గృహం నందు 100 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని ఎర్పాటు చేయనున్నారు. ఆ యొక్క ప్రాంతాన్ని అధికారులు, నాయుకులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ ఇందులో కరోన సోకిన వారికి ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా 50 ఆక్సిజన్ సిలెండర్స్ ను అందుబాటులో వుంటాయని అలాగే కరోన పేసేంట్లను పర్యవేక్షణ కొరకు అదనంగా ఒక డాక్టర్ మరియు సిబ్బంది ని ఎర్పాటు చేస్తున్నారని, కావున అశ్వారావుపేట మండలం లో కరోన వచ్చిన వారు మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంత హాస్పిటల్స్ కి వెళ్లి లక్షలు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఇక్కడ ఎర్పాటు చేసిన ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఉపయోగించుకొవలని ఇక్కడ మెరుగైన వైద్యం తో త్వరగా కరోన నుండి కొలుకోవచని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీపీ జల్లిపల్లి శ్రీ రాంమూర్తి, ఎంపీడిఓ విజయ, అశ్వారావుపేట పంచాయితీ సర్పంచ్ అట్టం రమ్య, పేరాయగూడెం పంచాయితీ సర్పంచ్ సుమతి, అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడి, ఏఈఓ, ఏఓ, విఆర్ఓ, సెక్రటరీ, యూఎస్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: