CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రైవేట్ స్కూల్స్ బోధన, బోధనేతర సిబ్బంది కి నెలకు 10,000 రూపాయలు చెల్లించాలి

Share it:

 



ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి డిమాండ్


మన్యం టీవీ పినపాక:

కరోనా కారణంగా ప్రైవేట్ స్కూల్స్ మూతపడటం వలన ఉపాధి కోల్పోయిన బోధన,బోధనేతర సిబ్బంది కి నెలకు 10,000 రూపాయలు చెల్లించాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో పినపాక మండలం లోని ప్రైవేట్ స్కూల్స్ బోధన,బోధనేతర సిబ్బంది స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, డిప్యూటీ తాహసిల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా కారణంగా ప్రైవేట్ స్కూల్స్ మూతపడటం వలన ప్రైవేట్ స్కూల్స్ బోధన, బోధనేతర సిబ్బంది ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు అని,కుటుంబ పోషణ భారమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, దిక్కుతోచని స్థితిలో మనో వేదనకు గురవుతున్నారని అన్నారు.ఇలాంటి పరిస్థితులలో వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విపత్తు నివారణ కింద వీరికి నెలకు 10,000 రూపాయలు చెల్లించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ బోధన,బోధనేతర సిబ్బంది ఇందారపు రవికుమార్,రాజు, రామకృష్ణ,సాంబిరెడ్డి,రాము,జానకిరామ్,శంకర్,శ్రావణి, స్వరూప,శ్రీజ,నాగమణి, భారతి,కావేరి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: