బాధితుల కు చెక్కును అందజేసిన,ట్రస్టు చైర్మన్, విప్ రేగా కాంతారావు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం,ఉప్పాక గ్రామం లో నివసిస్తున్న అంబాల.ప్రభు కుమార్ కి ఇద్దరు పిల్లలు వర్షిత్ 5 సంవత్సరాలు, సాత్విక్ 3 సంవత్సరాలు,వీరు ఇరువురికి చెవులు వినపడవు అని,వారు ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబం అని,వారి సమస్యను తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు దృష్టికి తీసుకువచ్చారు.వెంటనే స్పందించిన విప్ రేగా కాంతారావు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.10 వేల రూపాయల చెక్కును అంబాల.ప్రభు కుమార్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని. సుజాత,అశ్వాపురం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి. అమరేంధర్,ఎంపీటీసీ తాటి. సరిత,మొండికుంట సర్పంచ్ మర్రి.మల్లారెడ్డి,సర్పంచ్ సంధ్య, టిఆర్ఎస్ నాయకులు యూ.అనిల్ కుమార్,లంకెల. రమేష్,వి.మురళి కృష్ణ, కె.రామారావు,శ్యామల.సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: