CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

10రూ.. మాస్క్ పెట్టు లేకపోతే 1000 రూ జరిమానా కట్టు

Share it:

 



వినూత్న రీతిలో ఏడూళ్ల బయ్యారం పోలీసు శాఖ ప్రచారం


మన్యం మనుగడ పినపాక:


పినపాక మండల గ్రామ ప్రజలకు నమస్కారములు తెలియజేస్తూ ,  పినపాక మండల ఏడూళ్ల బయ్యారం పోలీస్ శాఖ వారు వినూత్న రీతిలో కరోనా వైరస్ పై ప్రచారం చేస్తున్నారు.కోవిడ్- 19  రెండో దశ  అధికంగా  విజృంభిస్తున్న పినపాక మండల  ప్రజలు కరోనా ను అరికట్టేందుకు మాస్క్ తప్పకుండా ధరించాలని, లేదంటే జరిమానా తప్పదు..అని మాస్క్ పెట్టని వాళ్లకు 1000 రూ.జరిమానా విధించాలని, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అని తెలియచేశారు. తప్పకుండా 10 రూ.ల మాస్క్ పెట్టు .1000రూ ఆదా చేసుకో అనే వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.గ్రామాల్లో ప్రతి మనిషికి తెలియ చేయాలని, ఇట్టి విషయమై గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ లు, వార్డ్ మెంబర్లు ప్రజలను చైతన్య పరచాలి  అని కోరుతూ ఉన్నాము అని పోలీసు శాఖ వారు తెలియజేశారు .మీ గ్రామము లోని లోకల్ గ్రూప్, యూత్ గ్రూప్, ఆటో గ్రూప్,మహిళ సంఘాల  గ్రూప్, రైతు సంఘాల గ్రూప్ యందు చేరేవిదంగా గ్రామ గ్రూప్ అడ్మిన్ లు బాధ్యత తీసుకోవాలి అని ఏడూళ్ల బయ్యారం ఎస్ఐ టీవీఆర్ సూరి అన్నారు

Share it:

TELANGANA

Post A Comment: