మన్యం టీవీ మంగపేట.
యంఆర్పిఎస్ గత 26 సం రాలుగా ఎస్సి ఎబిసిడీ వర్గీకరణ సాధన కోసం నిర్వహించిన పోరాటంలో పాల్గొన్న ఆశయ సాధనలో భాగంగా అమరత్వం పొందిన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మార్చి 1న ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామం ఎస్సీ కాలనీలో అమరులకు ఘనమైన నివాళి ఘటించిన మండల కన్వీనర్ కదురు మల్లేష్ మాదిగ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మంగపేట మండలం ఇంచార్జీ మడిపల్లి శ్యామ్ బాబు మాదిగ పాల్గొన్నారు.అమరుల ఆశయాల సాధన కోసం వర్గీకరణ మరియు అణగారిన వర్గాల రాజ్యాధికార సాధన దిశగా పోరాటాలు కొనసాగిస్తాం అని తెలియజేస్తున్నాం ఎస్సి ఎబిసిడీ వర్గీకరణ చేస్తాం అని అధికారంలో ఉన్న పార్టీలు హామీలు ఇస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయడం లో నిర్లక్ష్యం వహిస్తూ మాదిగ మాదిగ ఉపకులాలను నిరవదికంగ మోసం చేస్తున్నాయని ఈ విషయంలో కేంద్రంలో గల బీజేపీ రాష్టంలో గల తెరాస మోసపు మాటలను కట్టిబెట్టి వర్గీకరణ సాధన కోసం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,గుగ్గిళ్ళ సురేష్ మాదిగ,ఎంపెళ్ళి చందర్ రావు మాదిగ,యాసం రవి మాదిగ గుగ్గిళ నరసింహారావు మాదిగ యాసం రాకేష్ మాదిగ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: