మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు లోని శ్రీ విద్యా హై స్కూల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన మెడికల్ ఆఫీసర్స్ ఏ.మౌనిక పిహెచ్ సి మణుగూరు,జీ.గౌతమీ పుత్రి మెడికల్ ఆఫీసర్ ఆర్బీఎస్కె,ఎం.ఉమాదేవి మెడికల్ ఆఫీసర్ ఆర్బీఎస్కె, జె.పద్మావతి బ్యాంక్ మేనేజర్ ఎస్బిఐ,అందరినీ శ్రీ విద్యా స్కూల్ ప్రాంగణం లో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. అదేవిధంగా శ్రీ విద్య హై స్కూల్ లో నర్సరీ నుండి పదవ తరగతి వరకు చదువుకొని ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న పి.సింధు భార్గవి ని కూడ సన్మానించారు.శ్రీవిద్య డైరెక్టర్,కరెస్పాండంట్ నూకారపు రమేష్, మాట్లాడుతూ నేటి విద్యార్థినిలే రేపటి మహిళమానులుగా ఎదిగి సమాజ సేవ చేసి సమాజానికి ఉపయోగపడాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం ఉపాధ్యాయునిలు అందరిని ఘనంగా సత్కరించి, అభినందిచారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రభు కిరణ్,పి.సురేష్, వెంకట్,వాణి,నిహారిక,శిరీష,పీఈటి నరేందర్ పాల్గొన్నారు.
Post A Comment: