👉 మణుగూరు జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి విస్తృతంగా ప్రచారం
పాల్గొన్న ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు గెలుపే లక్ష్యం గా ప్రచారం
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామ పంచాయితీ లో శుక్రవారం టిఆర్ఎస్ పార్టి ఎమ్మెల్సీ అభ్యర్ది డా.పల్లా రాజేశ్వర రెడ్డి విజయాన్ని కాక్షింస్తూ జడ్పీటీసీ పొశం నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి, పట్టభద్రుల ఓటర్ల ఇంటింటికి వెళ్లి పల్లా రాజేశ్వర రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్లు ను కోరడం జరిగింది. కూనవరం గ్రామంలో పట్టభద్రుల ఓటర్ల ను ఉద్దేశించి జడ్పీటీసీ పొశం. నరసింహారావు,టి.బి.జి.కె.యస్ ఉపాధ్యక్షులు వూకంటి.ప్రభాకర్ రావు, మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసే అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు మరియు ఉద్యోగస్తులు కు అనేక రాయితీలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారికే దక్కుతుంది అని, అందుకనే ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి ని అఖండా మెజారిటీ తో గెలిపించాల్సిందిగా ఓటర్లు ను కోరారు.ఈ కార్యక్రమం లో మణుగూరు ఎంపీపీ కుమారి.విజయకుమారి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎం.పి.టి.సి.ల సంఘం ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, సర్పంచ్ సంఘం మండల అధ్యక్షుడు ఏనిక ప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యం బాబు, బూర్గంపాడు మార్కెట్ కమిటి డైరెక్టర్ సకిని బాబురావు,వార్డ్ మెంబర్లు ఎలిబోయిన సురేష్,వంక. సురయ్య,తోలెం.రాజేశ్వరి,టిఆర్ఎస్ పార్టీ నాయుకులు తంత్రపల్లి కృష్ణ,వంక అర్జున్ రావు,వాహేద్,లేఖత్,డ్రైవర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: