CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గద్దెనెక్కిన గిరిజన ఇలవేల్పులు

Share it:

 


గుండాల మన్యం టీవీ:

గుండాల మండలం యాపలగడ్డ గ్రామంలో గురువారం రెండవ రోజు పగిడిద్ద రాజు సమ్మక్క జాతర సంబరాలు అంబరాన్ని అంటేలా కొనసాగాయి. భర్ల గుట్ట నుండి వనదేవతలను గిరిజన సంప్రదాయలతో గద్దెలపైకి  తీసుకురావడంతో  నిండు  జాతర ప్రారంభమైంది.    ముందుగా పగిడిద్దరాజు సమ్మక్కల ఎదురు వెళ్లి కార్యక్రమం నిర్వహించారు . ఈ జాతరకు వివిధ జిల్లాల నుంచి భక్తులు, జనం భారీగా కదలి వచ్చారు. భక్తులతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పినపాక ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క వనదేవతలను దర్శించుకున్నారు. జాతర సందర్భంగా నాలుగు జిల్లాల వాలీబాల్ పోటీలను నిర్వహించారు.ఉత్సాహవంతంగా క్రీడలు కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ సభ్యులు అరేం లచ్చి పటేల్, అప్పయ్య, కాంతారావు, బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: