CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సాధా సీదాగా నిరాడంభరంగా పట్టభద్రులతో మాట్లాడిన ఎమ్మెల్సీ అభ్యర్థి భారతి కూరాకుల

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలంలోని రాజుపేట రామాలయంలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి భారతి కూరాకుల పట్టభద్రులతో కలిసి మాట్లాడారు, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నదని,కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్ల ఉసురు పోసుకున్నారని, ఉద్యమకాలలో ఇచ్చిన హామీలన్నీ                   అటకెక్కించారాని, నీళ్లు రాకపోయే, నిధులేమో కరిగిపోయే, నియామకాలు ఆగిపోయే ఇక ఈ ప్రభుత్వానికి ఓట్లు మనం ఎందుకు వేయాలని, ఏమి చేసారని, ఏమి సాధించారని, ఓట్లు అడుగుతున్నారు. ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చి, లేదా కాకతీయ క్యాంపస్ లోకి వచ్చి ఓట్లు అడిగి చూడండి మీకు దిమ్మ తిరిగే సమాధానాలు లభిస్తాయి అని ప్రభుత్వాన్ని    నిలదీశారు. పట్టభద్రులను ఈ సందర్బంగా ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి భారతి కూరాకుల అలోచించి నిర్ణయం తీసుకోవాలని చట్టం తెలిసిన తనను చట్ట సభలకి పంపిస్తే ప్రయోజనం ఉంటుందని మీరు చదువుకున్న మేధావులు కనుక మీరు తప్పక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో రాజుపేట పరిధిలోని గ్రామ పంచాయతీ లోని పట్టభద్రులు పూజారి ప్రభాకర్, అనుగోజు సమ్మోహన్, యర్ర శ్రవణ్,మడిసతీష్, గట్టి బాలు, కొమరం గణేష్, కర్రి రామ్మోహన్,జిగట శ్రీను, కుర్సం చిరంజీవి,నాగార్జున,గౌతమ్, పరమేష్, నర్సింహా రావు,శివకుమార్, నాగభూషణం,సురేష్, సతీష్, ఇబ్రహీం,రమేష్, బాబు,రాంబాబు, రాఘవ,దిలీప్,సురేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: