మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా దినోత్సవ వేడుకలను టీడీపీ మహిళ విభాగం నేతలు సమితి సింగారంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా తెలుగు దేశం మహిళ నాయకురాలు పసునూరి. సీత అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమితి సింగారం సర్పంచ్ బచ్చల.భారతి పాల్గొని మాట్లాడారు. కుటుంబం కోసం,సమాజం కోసం,త్యాగాలు చేసే మాతృమూర్తులను ఏదో ఒక రోజు గౌరవిస్తే సరిపోదని, ప్రతీక్షణం మహిళలను గౌరవించాల్సిన భాద్యత సమాజంపై ఉందన్నారు. మహిళలు తమ ఆరోగ్యంపట్ల శ్రద్ద వహించాలని,మహిళలు గౌరవించబడే చోట దేవతలు నివసిస్తారని,సమాజంలో మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తే అభ్యున్నతి సాధ్యమవుతుందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ ఎస్కె.బేగం, సమన్వయ సభ్యురాలు శ్రీదేవి,ఝాన్సీ,మాధవి,రజిని,అనసూర్య,విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: