మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,భద్రాచలం మండలం, భద్రాచలం పరిధిలో గల కేకే ఫంక్షన్ హాల్ లో గల ఈరోజు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మహా సభ నిర్వహించడం జరిగింది. ఈ మహాసభ కి ప్రాతినిధ్యం వహించిన భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ తెల్లం వెంకటరావు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలో పల్లె రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ సుమారు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు, ఆ ఉద్యోగాలు ఎలా భర్తీ చేశారు ఆయన ప్రతి విషయం విడమరచి చెప్పారు. ఉద్యోగస్తులకు పిఆర్సి టిఆర్ఎస్ ప్రభుత్వం త్వరలోనే పరిష్కారం చేస్తారని పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు .ఈ మహాసభలో పాల్గొన్న మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తేల్లం వెంకట్రావు మరియు తాతా మధు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: