మన్యం టీవీ: ఇల్లందు
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సింగరేణి జీకే ఓపెన్ కాస్ట్ లో జరగనున్న ఆచార్య చిత్రం షూటింగ్ పాల్గొనడానికి మెగాస్టార్ చిరంజీవి ఆదివారం సింగరేణి ఓపెన్ కాస్ట్ కు చేరుకున్నారు. మొట్టమొదటి సారిగా ఇల్లందు బొగ్గు గని కి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి కి ఏరియా జిఎం పి. వి సత్యనారాయణ పుష్పాలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి బొల్లం వెంకటేశ్వర్లు, ఎస్టేట్ తావుర్య నాయక్ సింగరేణి అధికారులు మెగాస్టార్ అభిమానులు పాల్గొన్నారు.
Post A Comment: