మన్యంటీవీ,అశ్వారావుపేట: మండల పరిదిలోని మేజర్ గ్రామ పంచాయితీ పరిధిలోగల గెస్ట్ హౌస్ ఏరియా అంగన్వాడి కేంద్రంలో
అంతర్జాతీయ మహిళాదినోత్సం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అశ్వారావుపేట గ్రామం పంచాయతీ సిబ్బందికి కరోనా టైంలో చేసిన సేవలను గుర్తించి వాళ్ళకు పాదపూజ చేసి సన్మానించడం జరిగింది. వారితో పాటు తోటి మహిళలు అయినా ఎండిఓ కి, అశ్వారావుపేట, పేరాయిగూడెం, నారంవారిగూడెం, ఉట్లపల్లి, అల్లిగూడెం మొదలగు పంచాయతీలో మహిళా సర్పంచులకు, అశ్వారావుపేట1 ఎంపీటీసీ కి, అంగన్వాడీ టీచర్స్కి, ఆయాలకు, ఉట్లపల్లి బేతేస్తా మెడికల్ సెంటర్ స్వచ్చంద సేవ సంస్థ సిస్టర్ కు సన్మానం చెయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటలు ఆడిన మహిళలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేమాల ఉషాదేవి, కట్ట రాధ, పాశం రాజేశ్వరి, కే నాగమణి, ఎం. రంగమ్మ, కే విజయ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: