మన్యం టీవీ మంగపేట.
హైదరాబాద్ లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన హీరో షోరూం యజమాని నాశిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు నాశిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి వెంకటరమణ లను ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరామర్శించి ఓదార్చారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు ఆపద సమయంలో ఉన్న కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అనంతరం వినయ్ కుమార్ రెడ్డి చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: