ఉట్నూరు మన్యం టీవీ
ప్రతినిధి.
ఆదిలాబాద్ జిల్లాలో రెండవ రోజు ఘనంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి ఆదివాసుల తొమ్మిది తెగలసదస్సు ఘనంగా ఆదివాసి ఉద్యోగుల సంక్షేమ మరియు సాంస్కృతిక సమాఖ్య ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సోయం బాపురావు ఆదిలాబాద్ ఎంపీ మాట్లాడుతూ గిరిజనులపై జరుగుతున్నటువంటి అనేక అన్యాయాలు అక్రమాలు అలాగే సమస్యల పరిష్కారం కోసం తన వంతు కేంద్ర ప్రభుత్వంతో కృషి చేస్తానని వారు పేర్కొన్నారు.గోడం నగేష్ మాజీ పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ గిరిజనుల అనేక సమస్యలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తో చర్చించి అనేక సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆత్రం సక్కు ఎమ్మెల్యే మాట్లాడుతూ 9 తెగల అన్ని జాతులు ఉద్యోగ ఇతరుల కూడా పాల్గొని సమస్యలు పరిష్కారం కొరకు ఉద్యోగస్తులు తమ వంతు పాత్ర పోషించాలని వారు కోరారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజును సన్మానించారు.ఈ కార్యక్రమంలో కనక లాక్కెరవ్ మాజీ ఐటీడీఏ చైర్మన్,కల్తీ వీరమల్లు రిటర్డ్ జాయింట్ కలెక్టర్,మెట్ల పప్పయ్య మొదటిరిటైర్డ్ ఇంజనీర్, సే దామకి గోధ్రు, రిటైర్డ్ అదనపు ఎస్పీ,ఆదివాసి ఉద్యోగుల సంక్షేమ సాంస్కృతిక రాష్ట్ర అధ్యక్షుడు గొందివెంకటరమణ అసోసియేట్ అధ్యక్షులు అనక దేవేందర్,ప్రధాన కార్యదర్శి జనార్ధన్ కనక రామారావు ఆర్కా మనిక్ రావు,చుంచు రామకృష్ణ సిడంకిషోర్ కోరేంగా సీతారాం,శ్రీనివాస్ రావు, డ్రా .తొడసం చందు, డాక్టర్ సుమలత,వేడామ బొజ్జు,ఆర్కా వసంత్ రావు, ఆత్రం భుజంగరావు,ఆత్రం సుగుణ,కనక వెంకటేష్,మెస్రం శేఖర్, ఇంకా అనేకమంది మేధావులు పాల్గొని ప్రసంగించారు.
Post A Comment: