మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని అనంతరం గ్రామానికి చెందిన పూనెం రాములమ్మ అనే దివ్యాంగ మహిళ టైలర్ కు (టీవీపిఎస్) తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో, చేతన్ ఫౌండేషన్ సహకారంతో.. సుమారు 20 వేల, రూపాయల ఖరీదు చేసే ఆధునిక మోడల్ కుట్టు మిషన్ ను ఆదివారం జూలూరుపాడు మండలం టీవీపిఎస్ అధ్యక్షులు సున్నం కరుణాకర్, అనంతరం గ్రామ సర్పంచ్ ఎదళ్ళపల్లి కళాశ్రీ, సీనియర్ టిఆర్ఎస్ నాయకులు ఎదళ్ళపల్లి వీరభద్రం, చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కళాశ్రీ మాట్లాడుతూ చేతన్ పౌండేషన్ సారధ్యంలో జిల్లా వ్యాప్తంగా దివ్యాంగ మహిళా టైలర్స్ కు కుట్టు మిషన్లు అందించడం అభినందనీయం అన్నారు. దివ్యాంగ మహిళలను ప్రోత్సహిస్తూ వారి ఆర్ధిక ఎదుగుదలకు దోహదపడుతూ.. వారి మనోధైర్యాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషకరం అన్నారు. జూలూరుపాడు మండలం లో మా అనంతరం గ్రామానికి చెందిన పూనెం రాములమ్మ అనే దివ్యాంగ మహిళ టైలర్ ను ఎంపిక చేసి ఆధునిక మోడల్ కుట్టు మిషన్ అందించినందుకు టీవీపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అయినా గుండుపునేని సతీష్, సున్నం కరుణాకర్, కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: