చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ పీవో కార్యాలయం ఎదురుగా సోమవారం జరిగిన పోరు గర్జన మహాసభకు చండ్రుగొండ మండలం నుంచి పోడు సాగుదారులు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం తరలివెళ్లారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఎస్కే ఉమర్ మాట్లాడుతూ... వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలి. ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేస్తున్న పోడు రైతుల కు పట్టాలివ్వాలని, పోడు భూములు ఆక్రమణను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకట్రావు, భద్రమ్మ, వెంకటేశ్వర్లు, ధరావత్ బాలు, భీముడు, పోడు రైతులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: